Breaking News

సిఎం పర్యటన ఏర్పాట్లు

సిఎం జగన్ కర్నూల్ టూర్

రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

కర్నూలు, సెప్టెంబర్ 18:- కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ నుండి 77 చెరువులకు నీరు అందించే పథకాన్ని ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించేందుకు పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఏర్పాట్లను పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సోమవారం కృష్ణగిరి మండలం లక్కసాగరం పంప్ హౌస్ వద్ద జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య లు ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా హెలిప్యాడ్ నందు చేసిన పనులను పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బoదిగా భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కి సూచించారు. తదనంతరం పంప్ హౌస్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.

కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు, పంచాయతీ రాజ్ ఎస్ఈ సుబ్రమణ్యం, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, డిపిఓ నాగరాజు నాయుడు, ఇంఛార్జి ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.