కర్నూలు జిల్లా జంగమ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా విశ్వేశ్వరయ్య, కార్యదర్శిగా బసవరాజు, కోశాధికారిగా శంకరరావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ విరూపాక్షయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. జంగమ కులస్తులకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పిటిసి స్థానాలను కేటాయించాలని నూతన అధ్యక్షుడు విశ్వేశ్వరయ్య రాజకీయ పార్టీ నాయకులను కోరారు.ఈ కార్యక్రమం లో జంగమ మహేశ్వర సంక్షేమ టౌన్ బాడీ మరియు ఆదోని, ఎమ్మిగనూరు వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు…